Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగలు పరుగెత్తుతుంటే.. వెనుక గన్‌మెన్లు.. సినీ ఫక్కీలో ఏటీఎం చోరీ...

Webdunia
గురువారం, 21 ఫిబ్రవరి 2019 (16:14 IST)
ఏటియంలో డబ్బులు పెట్టడానికి ఓ నలుగురు వ్యాన్ దిగారు. బాక్స్‌లలో ఫుల్‌గా క్యాష్ ఉంది. ఇంతలో తుపాకుల శబ్దం. అక్కడే రిక్షావాడు కునుకుతీస్తున్నాడు. పెద్ద శబ్దాలు వినిపించడంతో మేలుకున్నాడు. దాడి చేస్తున్న ముగ్గురిని గమనించాడు. వాళ్లు సిబ్బందిపై కాల్పులు జరిపారు. దోరికింది దోచుకున్నారు. దాదాపు 40 లక్షలు. రిక్షావాడు వారిని అడ్డుకుందామనుకున్నాడు, కానీ ఒకడు అతనిపై తుపాకీ పెట్టి బెదిరించాడు. ఏమీ చేయలేక మిన్నుకుండిపోయాడు. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. 
 
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా సెక్టార్ 82. కేంద్రీయ విహార్ సొసైటీ గేట్ నెంబర్ 2 వద్ద ఉన్న ఓ ఎస్బిఐ ఏటియం వద్ద ఈ తతంగం అంతా జరిగింది. నగదు పెట్టేవాళ్లు వాళ్ల ప్రయత్నాన్ని విరమించుకోలేదు. దొంగల వెనుక పడ్డారు. ముందర దొంగలు పరిగెత్తుతుండగా వెనుక గన్‌లతో నలుగురు వెంట పడ్డారు. చెవులు అదిరిపోయేలా కాల్పులు. బైక్‌లో వెళుతున్న దొంగలకు ఎదురుదెబ్బ, ఓ కార్ అడ్డంగా వచ్చి బైక్‌ని ఢీకొట్టింది. 500 రూపాయల నోట్లు గాల్లో ఎగురుతున్నాయి. 
 
కొన్ని కట్టలు క్రిందపడిపోయాయి. జనం హోరెత్తారు. డబ్బుల కోసం ఎగబడ్డారు. ఓ పిల్లాడు 500 రూపాయల కట్టలను తీసుకుని పరిగెత్తాడు. జనం దొరికింది దొరికినట్లు తీసుకుని పారిపోయారు. పండుగ వాతావరణం నెలకొంది. ఇంతలో పోలీసులు వచ్చి దొంగలను పట్టుకున్నారు. ప్రజల ఖాతాలలోకి వెళ్లిన సొమ్ము దాదాపు 20 లక్షలు అని చెబుతున్నారు. మిగతా ధనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments