Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో మాస్క్‌ లేకుండా తిరిగితే రూ. 2వేలు ఫైన్‌

Webdunia
శుక్రవారం, 20 నవంబరు 2020 (08:43 IST)
గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీని కరోనా వణికిస్తోంది. దీంతో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కట్టడి చర్యలు ప్రారంభించారు. అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటువంటి విపత్కర సమయాల్లో అన్ని పార్టీలు ఒక్కతాటిపైకి రావాలని విజ్ఞప్తి చేశారు. కోవిడ్‌తో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఇటువంటి సమయంలో రాజకీయాలు తగదని హితవు పలికినట్లు చెప్పారు.

బ్రతికుంటే జీవితమంతా రాజకీయాలు చేయవచ్చునని, కాని ఈ పరిస్థితుల్లో రాజకీయాలను పక్కన పెట్టి ప్రజల ప్రాణాలకు రక్షించేందుకు పాటు పడాలని సూచించానని కేజ్రీవాల్‌ తెలిపారు. మాస్క్‌ లేకుండా తిరిగితే రూ. 2 వేలు జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించారు.

గతంలో ఫైన్‌ రూ.500 ఉండగా దాన్ని ఇప్పుడు రెండు వేల రూపాయలకు పెంచారు. కాగా, పండుగలపై ఎలాంటి నిషేధాన్ని విధించలేదని స్పష్టం చేశారు. నదీ స్నానాలకు ఎక్కువ మంది హాజరుకావడంపై నిషేధం విధించినట్లు స్పష్టం చేశారు.

పండుగలన్నీ ఇళ్లల్లోనే ఉండి జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఛట్‌ పూజను జాగ్రత్తగా జరుపుకోవాలని, 200 కంటే ఎక్కువ మంది గుమిగూడకుండా ఉండాలని సూచించారు. గుంపులో ఒక్కరికి కరోనా సోకినా..మిగిలిన వారికి సోకే అవకాశాలున్నాయన్న నిపుణుల హెచ్చరికలను ఈ సందర్భంగా గుర్తు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments