Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో మాస్క్‌ లేకుండా తిరిగితే రూ. 2వేలు ఫైన్‌

Webdunia
శుక్రవారం, 20 నవంబరు 2020 (08:43 IST)
గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీని కరోనా వణికిస్తోంది. దీంతో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కట్టడి చర్యలు ప్రారంభించారు. అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటువంటి విపత్కర సమయాల్లో అన్ని పార్టీలు ఒక్కతాటిపైకి రావాలని విజ్ఞప్తి చేశారు. కోవిడ్‌తో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఇటువంటి సమయంలో రాజకీయాలు తగదని హితవు పలికినట్లు చెప్పారు.

బ్రతికుంటే జీవితమంతా రాజకీయాలు చేయవచ్చునని, కాని ఈ పరిస్థితుల్లో రాజకీయాలను పక్కన పెట్టి ప్రజల ప్రాణాలకు రక్షించేందుకు పాటు పడాలని సూచించానని కేజ్రీవాల్‌ తెలిపారు. మాస్క్‌ లేకుండా తిరిగితే రూ. 2 వేలు జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించారు.

గతంలో ఫైన్‌ రూ.500 ఉండగా దాన్ని ఇప్పుడు రెండు వేల రూపాయలకు పెంచారు. కాగా, పండుగలపై ఎలాంటి నిషేధాన్ని విధించలేదని స్పష్టం చేశారు. నదీ స్నానాలకు ఎక్కువ మంది హాజరుకావడంపై నిషేధం విధించినట్లు స్పష్టం చేశారు.

పండుగలన్నీ ఇళ్లల్లోనే ఉండి జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఛట్‌ పూజను జాగ్రత్తగా జరుపుకోవాలని, 200 కంటే ఎక్కువ మంది గుమిగూడకుండా ఉండాలని సూచించారు. గుంపులో ఒక్కరికి కరోనా సోకినా..మిగిలిన వారికి సోకే అవకాశాలున్నాయన్న నిపుణుల హెచ్చరికలను ఈ సందర్భంగా గుర్తు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments