Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిబ్రవరి నాటికి కరోనా వ్యాక్సిన్‌: సీరం సంస్థ

Webdunia
శుక్రవారం, 20 నవంబరు 2020 (08:40 IST)
కరోనా వ్యాక్సిన్ పై సీరం సంస్థ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఆస్ట్రాజెనికా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి సీరం సంస్థ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌పై కీలక ప్రకటన చేసింది.

ఆక్స్‌ఫర్డ్ కొవిడ్-19 వ్యాక్సిన్‌ను తొలుత హెల్త్‌కేర్ వర్కర్లకు, వయసు పైబడిన వారి కోసం ఫిబ్రవరి 2021 నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని, సామాన్య ప్రజలకు ఏప్రిల్‌లో అందుబాటులోకి తీసుకొస్తామని ఆ సంస్థ సీఈవో అదర్ పూనావాలా ప్రకటించారు. ఈ వ్యాక్సిన్ ధర రెండు డోసులకు గానూ దాదాపుగా రూ.1000 వరకూ ఉండొచ్చని పూనావాలా తెలిపారు.

ఇప్పటికే నాలుగు కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను సిద్ధం చేశామని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (సీఐఐ) తెలిపింది. నియంత్రణ సంస్థల నుంచి సరైన సమయంలో ఆమోదం లభిస్తే, 2021 జనవరి లోపు ఈ వ్యాక్సిన్‌ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని సీఐఐ సీఈఓ అదర్‌ పూనావాలా పేర్కొన్నారు.

కాగా, దేశంలో కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ కొవిషీల్డ్‌ కోసం మూడో దశ పరీక్షలకు నమోదు ప్రక్రియను పూర్తిచేశామని సీఐఐ, ఐసీఎంఆర్‌ ప్రకటించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments