ఇటీవల రద్దయిన పలు ఎక్స్ప్రెస్ రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు దక్షిణరైల్వే ప్రకటిం చింది. ఈ మేరకు దక్షిణరైల్వే చీఫ్ పీఆర్వో బి.గుగనేశన్ ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాలిలా వున్నాయి...
గోరఖ్పూర్-ఎర్నాకుళంగోరఖ్పూర్ (నెం.05303/ 05304) ప్రత్యేక రైళ్లు ఈ నెల 19 నుంచి ప్రారంభం కాను న్నాయి. గోరఖ్పూర్-ఎర్నాకుళం ప్రత్యేక రైలు ఈ నెల 19, 26 (శనివారం) తేదీల్లో ఉదయం 8.30 గంటలకు గోరఖ్పూర్లో బయల్దేరి మూడో రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు ఎర్నాకుళం చేరుకుంటుంది.
అలాగే, ఎర్నా కుళం-గోరఖ్పూర్ ప్రత్యేక రైలు ఈ నెల 21, 28 (సోమవారం) రాత్రి 11.55 గంటలకు ఎర్నాకుళంలో బయల్దేరి నాలుగో రోజు ఉదయం 6.30 గంటలకు గోరఖ్పూర్ చేరుకుంటుంది.