Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి ఎంపీ నవనీత్ కౌర్‌కు సుప్రీంకోర్టులో ఊరట..

Webdunia
మంగళవారం, 22 జూన్ 2021 (17:01 IST)
మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. నటి, అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ కుల సర్టిఫికెట్ విషయంలో ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. కాగా నకిలీ కుల ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించి మోసగించారనే ఆరోపణతో ముంబై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన ముంబై హైకోర్టు ఆమె ఎస్సీ కాదని తీర్పు ఇచ్చింది. అంతేకాదు ఆమెకు రూ. 2 లక్షల జరిమానా కూడా విధించింది. ముంబై కోర్టు తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయించింది ఎంపీ నవనీత్ కౌర్.
 
జస్టిస్‌ వినీత్‌ సరన్‌, దినేష్‌ మహేశ్వరిల వేకేషన్‌ బెంచ్‌ నవనీత్‌ కౌర్‌ పిటిషన్‌పై విచారణ జరిపి మంగళవారం స్టే విధించింది. ఇక కులధ్రువీకరణ పత్రం వ్యవహారంపై ఫిర్యాదు చేసిన వ్యక్తితో పాటు మరికొందరికి నోటీసులు జారీచేసింది సుప్రీం కోర్టు. కాగా నవనీత్ కౌర్ అమరావతి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments