Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.2.40 లక్షలు.. ఆ మత్స్యకారుడి అదృష్టం పండింది.. కచ్చేళ్ళ చేప చిక్కింది..

Webdunia
మంగళవారం, 22 జూన్ 2021 (16:57 IST)
Kachella
ఓ మత్స్యకారుడి అదృష్టం పండింది. రోజువారీ లాగే చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు కచ్చేళ్ళ చేప రూపంలో అదృష్టం వలకు చిక్కింది. అయితే సోమవారం కచ్చేళ్ళ చేపను ఒడ్డుకు తీసుకొచ్చారు. దీనిని కొనుగోలు చేసేందుకు పలువురు పోటీ పడ్డారు.  
 
గోదారమ్మను నమ్ముకుని నదిలోకి చేపల వేటకు వెళ్లే జాలర్లకు అన్ని రోజులు ఒకేలా ఉండవు. మత్స్యకారులకు ఇది నిత్య పోరాటమే. ఆ తరహాలోనే నదిలోకి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఊహించని అదృష్టం వారి వలకు చిక్కింది. 
 
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ఫిషింగ్ హార్బర్‌లో వేటకు వెళ్లిన జాలర్లకు అరుదైన చేప చిక్కింది. దీనిని కొనుగోలు చేసేందుకు పలువురు పోటీ పడ్డారు. చివరకు అదే ప్రాంతానికి చెందిన దారకొండ అనే వ్యాపారి రూ.2.40 లక్షలకు దక్కించుకున్నారు. 
 
చేప జాతుల్లో దొరికే అరుదైన రకాల్లో ఈ కచ్చిలి చేప ఒకటి.. ఈ చేప పొట్ట భాగాన్ని మందుల తయారీలో వినియోగిస్తారని, అందుకే ఇంత గిరాకీ అని మత్స్యకారులు తెలిపారు. ఇప్పుడు గోదావరి తీరంలో ఇది పెద్ద హాట్‌టాపిక్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments