Webdunia - Bharat's app for daily news and videos

Install App

తివారీ డ్యామ్‌కు గండి పడింది పీతల వల్లేనట!

Webdunia
శుక్రవారం, 5 జులై 2019 (16:07 IST)
మహారాష్ట్రలో కురుస్తున్న భారీవర్షాల కారణంగా తివారీ ఆనకట్టకు గండి పడిన సంగతి తెలిసిందే. ఈ గండి కారణంగా డ్యామ్‌లోని నీళ్లు క్రింద వైపు ఉన్న ప్రాంతం మొత్తాన్ని ముంచివేయడం జరిగింది. డ్యామ్ కింద వైపు ఉన్న 12 నివాసాలు కొట్టుకుపోయి... 23 మంది గల్లంతు కాగా... ఇప్పటి వరకు 19 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. 
 
కాగా... ఆనకట్టకు గండిపడటంపై మహారాష్ట్ర నీటి వనరుల శాఖ మంత్రి తానాజీ సావంత్ ఆసక్తికరమైన వివరణ ఇచ్చారు. డ్యామ్ చుట్టూ పెద్ద సంఖ్యలో పీతలు ఉన్నాయని... వాటి వల్లే ఆనకట్టకు లీకేజీ ఏర్పడిందని చెప్పుకొచ్చారు. 
 
ఇంతకు ముందు లీకేజీలు లేవని... డ్యామ్ చుట్టూ పీతలు చేరిన తర్వాతే ఈ ఘటన చోటు చేసుకుందని వెల్లడించిన ఆయన... ఈ విషయాన్ని స్థానికులు తమ దృష్టికి తీసుకొచ్చారని చెప్పడం ఇక్కడ కొసమెరుపు. 
 
అయితే అధికారులు దీనికి సంబంధించిన పనులు కూడా చేపట్టారని... అయినప్పటికీ దురదృష్టవశాత్తూ ప్రమాదం జరిగి పోయిందని ఆవేదన వ్యక్తం చేసారు. అవేవో పీతలు కాబట్టి సరిపోయింది కానీ మొసళ్లు అయితే ఏమై ఉండేదో మరి మంత్రిగారికే తెలియాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments