Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్య రామునికి చలి చలి.. దుప్పట్లు కప్పేశారు.. హీటర్లు కూడా..?

Webdunia
బుధవారం, 16 డిశెంబరు 2020 (16:34 IST)
ఉత్తరప్రదేశ్‌లో చలితీవ్రత పెరిగింది. దీంతో అయోధ్యలోని రామ్‌లల్లా విగ్రహంతో పాటు ఇతర దేవుళ్లకు చలిపెట్టకుండా కప్పేందుకు దుప్పట్లు, గది ఉష్ణోగ్రతలు పెరిగేలా హీటర్స్ ఏర్పాటు చేశారు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేసిన తర్వాత ఇలాంటి ఏర్పాట్లు చేయడం ఇది రెండోసారి. 
 
గతేడాది స్థానిక హందూ మత పెద్దలు కొంత మంది విశ్వ హిందూ పరిషత్‌ సభ్యులతో కలిసి అయోధ్య కమిషనర్‌కు అభ్యర్థన చేసిన తర్వాత ఇలాంటి ఏర్పాట్లు చేశారు. 
 
తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఆలయంలో దేవుళ్లు చలిలో బాధపడకుండా చూసుకునేందుకు. హీటర్లను ఏర్పాటు చేశామని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్రదాస్‌ తెలిపారు. ఇది కాకుండా, వెచ్చని దుప్పట్లు కప్పామన్నారు. 
 
ఆలయంలో ఫైర్‌ప్లేస్‌ను ఏర్పాటు చేయాలనుకున్నామని.. అయితే ఈ తాత్కాలిక ఆలయం చెక్క, గాజుతో తయారు చేశారని తెలిపారు. అది సురక్షితం కాదని విరమించుకున్నామన్నారు. చలి తగ్గేవరకు ఈ ఏర్పాట్లు కొనసాగుతాయని చెప్పారు సత్యేంద్రదాస్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

తర్వాతి కథనం
Show comments