5జీ స్పెక్ట్రమ్‌కు ముహూర్తం ఫిక్స్.. మార్చి నాటికి వేలం

Webdunia
బుధవారం, 16 డిశెంబరు 2020 (16:28 IST)
5జీ స్పెక్ట్రమ్‌కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. మార్చిలో 5జీ స్ప్రెక్ట్రమ్ వేలం వేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. వాటిలో స్ప్రెక్ట్రమ్ వేలం కూడా ఒకటి. 5జీ స్ప్రెక్ట్రమ్ కొనుగోలు చేయాలనుకునే వారి నుంచి దరఖాస్తులను ఈ నెలలోనే పిలుస్తారు. మార్చి నాటికి వేలం ప్రక్రియను పూర్తి చేస్తారు. 
 
మొత్తం మూడు రకాలైన స్ప్రెక్ట్రమ్‌ను వేలం వేయనున్నారు. అలాగే, టెలీకమ్యూనికేషన్ సెక్టార్‌లో నేషనల్ సెక్యూరిటీ డైరెక్టివ్ ఏర్పాటు చేయాలని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయించింది. టెలికం సర్వీస్ ప్రొవైడర్ల కోసం నమ్మకమైన, సర్వీసుదారులను, ఉత్పత్తుల జాబితాను కేంద్రం ప్రకటించనుంది.
 
ఇందులో భాగంగా 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz , 2500 MHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్‌లో మొత్తం 20 సంవత్సరాలకు స్ప్రెక్ట్రమ్ వేలానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్టు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. మొత్తం 2251.25 MHz వేలం వేయనున్నట్టు చెప్పారు. దీని ద్వారా రూ. 3,92,332.70 కోట్ల ఆదాయం లభిస్తుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments