Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు సర్కారుకు వార్నింగ్ ఇచ్చిన సూపర్ స్టార్ రజినీ!

Webdunia
ఆదివారం, 10 మే 2020 (15:03 IST)
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ గట్టివార్నింగ్ ఇచ్చారు. లాక్‌డౌన్ సమయంలో మద్యం విక్రయాలు వద్దనీ, తక్షణం మద్యం దుకాణాలను మూసివేయాలంటూ మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీటిపై ప్రభుత్వం అప్పీల్ చేసింది. 
 
ఈ విషయంపై అనేక మంది సెలెబ్రిటీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకట్టవేయలేని ఈ సర్కారుకు మద్యం విక్రయాలు అంత ముఖ్యమా అంటూ నిలదీస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరవాలన్న ఆలోచనను మానుకోవాలని సూచించారు. ఒకవేళ మద్యం దుకాణాలు తెరిస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వస్తామన్న ఆశలు వదులుకోవాల్సిందేనని అధికార పార్టీపై వ్యాఖ్యలు చేశారు. ఆదాయ మార్గాల కోసం ఇతర మార్గాలపై దృష్టి సారించాలని ప్రభుత్వానికి సూచించారు.
 
కాగా, తమిళనాడులో మద్యం దుకాణాలను మూసివేయాలంటూ ప్రభుత్వానికి రెండు రోజుల క్రితం మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి దీనిపై స్టే కోరుతూ శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆన్‍లైన్ ద్వారా మద్యం విక్రయించడం, డోర్ డెలివరి చేయడం సాధ్యం కాదని తన పిటిషన్‌లో పళనిస్వామి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments