Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా న్యూస్ : ఎయిర్ ఇండియా పైలట్లకు పాజిటివ్...

Webdunia
ఆదివారం, 10 మే 2020 (13:11 IST)
దేశంలో కరోనా వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తూనే వుంది. గత 24 గంటల్లో కొత్తగా 3277 కరోనా కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 62939కి చేరాయి. అలాగే, గత 24 గంటల్లో 127 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ వైరస్ బారినపడి చనిపోయినవారి సంఖ్య 2109కి చేరింది. ఇప్పటివరకు కరోనా నుంచి 19,358  మంది కోలుకున్నారు. ఆసుపత్రుల్లో 41,472 మంది చికిత్స పొందుతున్నారు. 
 
ఈ పరిస్థితుల్లో ఎయిప్ ఇండియాకు చెందిన ఐదుగురు పైలెట్లకు కరోనా పాజిటివ్ అని తేలినట్టు వార్తలు వస్తున్నాయి. టేకాఫ్ అయ్యేందుకు 72 గంటల ముందు పలువురు పైలెట్లకు జరిపిన పరీక్షల్లో ఈ విషయం వెలుగుచూసింది. 
 
కాగా, చైనాలోని వుహాన్‌లో కరోనా వైరస్ వెలుగు చూసిన తర్వాత ఎయిర్ ఇండియా అనేక ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేసింది. ముఖ్యంగా, ప్రపంచ దేశాలకు అవసరమైన హైడ్రాక్సీక్లోరోక్వీన్ మాత్రలను ఎయిర్ ఇండియా సరఫరా చేసింది. ఇందుకోసం ఎయిర్ ఇండియా పలు దేశాలకు ప్రత్యేక విమాన సర్వీసులను నడిపింది. 
 
ప్రపంచం మొత్తం లాక్డౌన్ ఉంటే ఎయిర్ ఇండియా మాత్రం పలు మిషన్లను విజయవంతంగా పూర్తిచేసే పనిలో నిమగ్నమైంది. ఈ క్రమంలోనే పలువురు పైలెట్లు కరోనా బాధిత దేశాలకు వెళ్లగా, ఆ సమయంలో ఈ వైరస్ సోకివుండొచ్చన్న అనుమానిస్తున్నారు. అయితే, కరోనా వైరస్ సోకిన ఐదుగురు పైలెట్ల వివరాలు తెలియాల్సివుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments