Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య నచ్చలేదని.. తన స్నేహితులకు అమ్మేశాడు..

Webdunia
సోమవారం, 22 నవంబరు 2021 (21:29 IST)
భార్య నచ్చలేదని.. తన స్నేహితులకు అమ్మేశాడు.. ఓ భర్త. వారు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాజస్థాన్ కోట ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ కోటకు సమీపంలోని బుండి ప్రాంతానికి చెందిన బాధిత మహిళ తండ్రి ఈ నెల 3వ తేదీన స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. 
 
తన కూతురు కనిపించడం లేదని మిస్సింగ్ ఫిర్యాదు చేశాడు. తన కూతురిని విజయ్‌గఢ్ ప్రాంతానికి చెందిన రాకేష్‌కు ఇచ్చి వివాహం చేశానని, అతడే తన కూతురిని వేరే వారికి అమ్మేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం ఆమెను కనుగొన్నారు.
 
తన భర్త రాకేష్, వదిన ప్రియ తనను తరచుగా హింసించేవారని బాధితురాలు వాపోయింది. ఈ నెల మూడో తేదీన తనను ముగ్గురు వ్యక్తులకు అమ్మేశారని బాధిత మహిళ చెప్పింది. వారు తనను ఓ ఇంట్లో నిర్భంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాకేష్, ప్రియను అదుపు లోకి తీసుకున్నారు. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తుల గురించి గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Rohit: తను నా లక్కీ చార్మ్.. అందుకే సుందరకాండ చేశాం : నారా రోహిత్

బార్బరిక్.. ఫ్రీగా చూడాల్సిన మూవీ కాదని వాళ్లు డబ్బులు ఇచ్చారు : విజయ్ పాల్ రెడ్డి

సినిమాల్లోనే కాదు.. వ్యక్తిగతంగా లోపాలను వెతుకుతున్నారు : అనుపమ పరమేశ్వరన్

కపుల్ ఫ్రెండ్లీ లో సంతోష్ శోభన్, మానస వారణాసి ల కెమిస్ట్రీ సాంగ్

పవన్ చేతిపై ఉన్న టాటూ అక్షరాలకు అర్థమేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments