Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిని సరిగా చూసుకోవడం లేదనీ భార్యలను తగలబెట్టిన భర్త...

తన తల్లిని సరిగా చూసుకోవడం లేదన్న కోపంతో తన ఇద్దరు భార్యలను తగలబెట్టాడోభర్త. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,

Webdunia
బుధవారం, 20 డిశెంబరు 2017 (17:28 IST)
తన తల్లిని సరిగా చూసుకోవడం లేదన్న కోపంతో తన ఇద్దరు భార్యలను తగలబెట్టాడోభర్త. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాజస్థాన్‌కు చెందిన దీపా రామ్ అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు. వృద్ధురాలైన ఈయన తల్లికూడా వీరితోనే కలిసివుంటుంది. అయితే, ఆ తల్లిని తన ఇద్దరు భార్యలు సరిగా చూడటం లేదని గ్రహించిన దీపారాయ్ వారిద్దరికి తగిన గుణపాఠం చెప్పాలని భావించాడు. ఇందుకోసం ఓ ప్లాన్ వేశాడు. 
 
బంగారం కొనిస్తా అంటూ తన ఇద్దరు భార్యలు దరియా దేవి, మాలి దేవిలను ఇంటి నుంచి కారులో తీసుకెళ్లాడు. కారులో ఈ ముగ్గురూ గొడవపడ్డారు. దీంతో ఇద్దరు భార్యల్లో ఒకరు కారు నుంచి దిగి అక్కడున్న వారి సాయం కోరడానికి ప్రయత్నించింది. అయితే దీపా రామ్ ఆమెను మళ్లీ కారులో నెట్టేసి అలాగే డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడు. 
 
కొంత దూరం తర్వాత తాను బయటకు వచ్చి కారును లాక్ చేసిన దీపారామ్ కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో ఇద్దరు భార్యలకు గాయాలయ్యాయి. తాను నేరం చేసినట్లు అంగీకరించడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments