Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్‌లో విషాదం : పడవ మునిగి 13 మంది మృత్యువాత

Webdunia
శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (12:22 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో గురువారం జరిగిన విషాద ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 13కు చేరింది. చంబల్ నదిలో పడవ మునిగిపోవడంతో ఈ విషాదం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న సహాయక బృందాలు రంగంలోకి దిగి మరో రెండు మృతదేహాలను వెలికితీశాయి. మృతులను జ్యోతి (13), గ్లోమా (15)గా గుర్తించారు. ఘటనా స్థలానికి కిలోమీటరున్నర దూరంలో వీరి మృతదేహాలను గుర్తించినట్లు సహాయ బృందాలు తెలిపాయి.
 
ఖటోలీ ప్రాంతం నుంచి 35 మంది భక్తులు, 18 బైకులతో బుంది జిల్లాలోని కాళేశ్వర్‌ స్వామి ఆలయానికి వెళ్తుండగా పడవ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం నుంచి 22 మంది సురక్షితంగా బయటపడగా 13 మంది గల్లంతయ్యారు. వీరిలో 11 మంది మృతదేహాలను ఇప్పటికే వెలికితీయగా శుక్రవారం మరో రెండు మృతదేహాలను వెలికితీశారు. 
 
పడవ సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించి ప్రమాదానికి కారణమైన మహేంద్ర మీన, హేమ్‌రాజ్‌, మోదులాల్‌, వినోద్‌తోపాటు మరొకరిపై 304 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు తెలిపారు. ఘటనా స్థలాన్ని ఆ రాష్ట్ర మంత్రి శాంతి ధరివాల్‌ పరిశీలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments