Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాయ్‌పూర్‌లో వితంతువును బెదిరించి గ్యాంగ్ రేప్

ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌ నగర శివారు ప్రాంతంలో ఓ వితంతువుపై సామూహిక అత్యాచారం జరిగింది. హోటల్‌లో పని చేసే సహోద్యోగి నమ్మించి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్ళగా ఈ దారుణం జరిగింది.

Webdunia
బుధవారం, 27 డిశెంబరు 2017 (13:56 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌ నగర శివారు ప్రాంతంలో ఓ వితంతువుపై సామూహిక అత్యాచారం జరిగింది. హోటల్‌లో పని చేసే సహోద్యోగి నమ్మించి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్ళగా ఈ దారుణం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాయ్‌పూర్‌కు చెందిన వితంతువు ఓ హోటల్‌లో కిచెన్‌లో పాచిపని చేస్తూ వస్తోంది. అదే హోటల్‌లో పని చేస్తున్న సురేశ్ సాహు(24) అనే యువకుడితో ఈమెకు పరిచయం ఏర్పడి, అది మరింత సన్నిహితంగా మారింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఆమెకు మాయమాటలు చెప్పి నిర్జనప్రదేశానికి తీసుకెళ్లాడు. 
 
అక్కడ ఆమెపై అత్యాచారం చేసేందుకు యత్నించగా, ఆమె ప్రతిఘటించి, కేకలు వేసింది. ఈ కేకలు ఆలకించి ముగ్గురు వ్యక్తులు అక్కడకు చేరుకుని సాహును బెదిరించి తరిమిగొట్టారు. అనంతరం ఈ ముగ్గురు కలిసి ఆ వితంతువుపై అత్యాచారానికి పాల్పడ్డారు. పైగా, ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తామని బాధితురాలిని బెదిరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం