Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ పజిల్‌ను పరిష్కరించేది ఎలా? రాహుల్ గాంధీ

Webdunia
సోమవారం, 4 మే 2020 (11:54 IST)
కేంద్ర ప్రభుత్వం, భారతీయ రైల్వే శాఖ తీరును కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తూర్పారబట్టారు. లాక్‌డౌన్ కారణంగా ఆయా ప్రాంతాల్లో చిక్కుకునిపోయిన వలస కూలీలను తరలించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో రైల్వే శాఖ ముందుకు వచ్చి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అయితే, ఈ రైళ్ళలో ప్రయాణించే వలస కూలీల నుంచి రైల్వే శాఖ చార్జీలు వసూలు చేస్తోంది. ఇది పెద్ద దుమారాన్ని రేపింది. వలస కూలీల నుంచి రైలు టిక్కెట్ల కోసం డబ్బులు తీసుకోవడంపై రాహుల్ విమర్శలు గుప్పించారు. 
 
'ఓ వైపు దేశంలోని వలస కూలీలను తమ ప్రాంతాలకు తరలించడానికి కూలీల నుంచి రైల్వే శాఖ టిక్కెట్ల కోసం డబ్బులు వసూలు చేస్తోంది. మరోవైపు అదే రైల్వే శాఖ పీఎం కేర్స్‌ ఫండ్‌కు రూ.151 కోట్లు విరాళంగా ఇస్తోంది. ఈ పజిల్‌‌ను పరిష్కరించేది ఎలా?' అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. 
 
కాగా, వలస కూలీల నుంచి టిక్కెట్ డబ్బులు వసూలు చేయడం సరికాదని, కావాలంటే వారి టిక్కెట్ల డబ్బులను తాము భరిస్తామని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆమె కేంద్రానికి ఓ లేఖ కూడా రాసింది. ఇపుడు రాహుల్ గాంధీ కూడా ఇదే అంశంపై ట్వీట్ చేయడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: ఎన్టీఆర్‌ నీల్‌ చిత్రం వ‌ర‌ల్డ్ వైడ్‌ విడుద‌ల‌ తేదీ ప్రకటన

ఆ కోలీవుడ్ హీరో అలాంటివారా? ఆ హీరోయిన్‌ను వాడుకుని వదిలేశారా?

Sobhita: తల్లిదండ్రులు కాబోతున్న నాగచైతన్య-శోభిత?

Vijay Deverakonda : రౌడీ వేర్ లో స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న స్టార్ హీరో సూర్య

Dimple Hayathi: సక్సెస్ కోసం ముగ్గురి కలయిక మంచి జరుగుతుందేమో చూడాలి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

తర్వాతి కథనం
Show comments