మిజోరం, తెలంగాణ రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ పర్యటన

Webdunia
గురువారం, 12 అక్టోబరు 2023 (18:52 IST)
తెలంగాణలో కీలకమైన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దాదాపు ఐదు రోజుల పాటు మిజోరం, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. అక్టోబర్ 15, 16 తేదీల్లో రాహుల్ గాంధీ మిజోరంలో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
 
అక్టోబరు 17న జరిగే పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశానికి గాంధీ హాజరవుతారని, అనంతరం సాయంత్రం తెలంగాణకు బయలుదేరి వెళతారని ఆ వర్గాలు తెలిపాయి. 
 
అక్టోబరు 18, 19, 20 తేదీల్లో మూడు రోజుల పాటు తెలంగాణలో కాంగ్రెస్ బస్సుయాత్ర కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. అక్టోబర్ 18న జరిగే బస్సు యాత్రలో ప్రియాంక గాంధీ వాద్రా కూడా పాల్గొనే అవకాశం ఉంది.
 
 అక్టోబర్ 16న రాజస్థాన్‌లో జరిగే బహిరంగ సభలో పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ప్రసంగిస్తారు.118 మంది సభ్యులున్న తెలంగాణ అసెంబ్లీకి నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా, 40 మంది సభ్యులున్న మిజోరాం, 200 మంది రాజస్థాన్ అసెంబ్లీలకు నవంబర్ 7న, నవంబర్ 25న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనిల్ రావిపూడి ఆవిష్కరించనున్న అన్నగారు వస్తారు టీజర్

మరువ తరమా సినిమా పెద్ద విజయం సాధించాలి : రఘు రామ కృష్ణరాజు

Andhra King Taluka Review: అభిమానులకు స్పూర్తినిచ్చేలా ఆంధ్ర కింగ్ తాలూకా.. మూవీ రివ్యూ

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments