Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నువ్వే నా గురువు, మార్గదర్శకులు, నా బలం' : రాహుల్

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన నాన్నమ్మ, మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీని సంస్మరించుకున్నారు. ఆదివారం ఇందిరా గాంధీ శత జయంతి వేడుకను పురస్కరించుకుని ఆయన తన ట్విట్టర్‌ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు.

Webdunia
ఆదివారం, 19 నవంబరు 2017 (17:03 IST)
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన నాన్నమ్మ, మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీని సంస్మరించుకున్నారు. ఆదివారం ఇందిరా గాంధీ శత జయంతి వేడుకను పురస్కరించుకుని ఆయన తన ట్విట్టర్‌ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. తన నానమ్మకు ట్విట్టర్‌ ద్వారా నివాళులర్పించారు. "నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా ఎంతో సంతోషంగా ఉంటుంది నానమ్మా. నువ్వే నా గురువు, మార్గదర్శకులు, నా బలం" అంటూ ట్వీట్ చేశారు.
 
కాగా, ఆదివారం ఉదయం ఢిల్లీలోని శక్తి స్థల్‌ స్థూపాన్ని రాహుల్‌, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సందర్శించి ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 
 
సూటిగా మాట్లాడే తత్వమే ఇందిరను గొప్ప నాయకురాలిని చేసిందని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యానించారు. ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని దేశానికి దిశానిర్దేశం చేసిన మహిళా నేత ఇందిరా అని, అందుకే ఆమెను ప్రతి ఒక్కరూ భారత ఉక్కు మహిళ అని కొనియాడారని గుర్తు చేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments