Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాపీ మేస్త్రిగా మారిన రాహుల్ గాంధీ.. ఎక్కడ? (Video)

వరుణ్
శుక్రవారం, 5 జులై 2024 (14:21 IST)
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాపీ మేస్త్రీగా మారిపోయారు. ఆయన భవన నిర్మాణ కార్మికులతో కలిసి పార, తాపీ పట్టుకున్నారు. నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో సిమెంట్‌లో నీళ్లుపోసి ఇసుక, సిమెంట్‌ను మిశ్రమంగా చేశారు. ఆ మిశ్రమంతో తాపీతో మెట్ల నిర్మాణం చేపట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫోటోలను కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ఎక్స్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. కార్మికులు తమ చేతులతో దేశాన్ని నిర్మిస్తున్నారంటూ ట్వీట్ కింద పేర్కొంది. 
 
ఢిల్లీలోని గురు తేజ్ బహదూర్ (జీటీబీ) నగర్‌లో కొందరు భవన నిర్మాణ కార్మికులను రాహుల్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత వారితో కలిసి నిర్మాణ పనుల్లో నిమగ్నమై, ఆ తర్వాత కాసేపు ముచ్చటించారు. ఆ తర్వాత కారులో తిరిగి వెళుతూ ఆయన ఈ అంశంపై తన అభిప్రాయాలను షేర్ చేశారు. 
 
దేశంలో కూలిపనులు చేసే వారికి గౌరవ లభించడం లేదు. గతంలోనూ ఈ విషయం చెప్పా. ఇవాళ జీటీబీ నగర్‌లో కూలీలను కలిసి మాట్లాడాక ఈ విషయం మరోమారు రుజువైంది. కూలీలు నిత్యం పనికోసం జీటీబీ నగర్‌లో ఎదురు చూస్తుంటారు. ఒక్కోసారి ఆ కాస్త డబ్బు కూడా దొరుతుందన్న గ్యారెంటీ లేదు. కార్మికులు, కూలీలకు పూర్తిగా హక్కులు, గౌరవం తీసుకురావడమే నా జీవిత లక్ష్యం అని రాహుల్ తన సందేశంలో పేర్కొన్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments