Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరో తరగతి చదువుతున్న బాలికతో యువకుడి పెళ్లి..!!

వరుణ్
శుక్రవారం, 5 జులై 2024 (14:01 IST)
తెలంగాణ రాష్ట్రంలోని పాలమూరు జిల్లాలో ఓ మైనర్ బాలికకు తల్లిదండ్రులే వివాహం చేశారు. ఆరో తరగతి చదువుతున్న తమ కుమార్తెకు తల్లిదండ్రులే ఈ పనికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని పాఠాశాల ఉపాధ్యాయులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, పాలమూరు జిల్లా గండీడ్ మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బీరుప్ప అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఆరో తరగతి చదివే బాలికను వివాహం చేసుకున్నాడు. వేసవి సెలవులు కావడంతో జూన్ నెలలో బాలికకు వివాహం చేసినట్టు తెలిపారు. 
 
ఈ క్రమంలో ఇటీవల మళ్లీ పాఠశాలలు ప్రారంభం కావడంతో బాలిక స్కూల్‌కు వెళ్లింది. అయితే, ఆమె ప్రవర్తనలో మార్పు గమనించిన ఉపాధ్యాయులు అనుమానం వచ్చి జిల్లా అధికారులకు సమాచారం అందించారు. పాఠశాలకు వచ్చిన అధికారులు బాలిక వద్ద ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ఆ బాలికను స్టేట్ హోంకు తరలించారు. అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు బీరప్పతో పాటు తల్లిదండ్రులపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments