Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రామోజీరావు సంస్మరణ సభ- రాజమౌళి-బాబు-పవన్- కీరవాణి టాక్ (వీడియో)

Babu-Rajamouli_Pawan

సెల్వి

, గురువారం, 27 జూన్ 2024 (18:49 IST)
Babu-Rajamouli_Pawan
విజయవాడలో జరుగుతున్న రామోజీరావు సంస్మరణ సభకు ప్రముఖ దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను వీరు మర్యాదపూర్వకంగా కలిసి కాసేపు ముచ్చటించారు. 
 
ఈ సందర్భంగా రాజమౌళి గురించి కీరవాణితో చంద్రబాబు ఏదో చెప్తూ కనిపించారు. ఆపై రాజమౌళి కూడా చంద్రబాబు చెవిలో ఏదో చెప్పారు. ఆపై సంగీత దర్శకుడు కీరవాణి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను పలకరించారు. 
 
ఏపీ ప్రభుత్వం రామోజీ సంస్మరణ సభను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ సభకు రాజకీయ, సినీ, పాత్రికేయ రంగాల వారు విచ్చేశారు. ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్, విజయవాడ ఎమ్మెల్యే సుజనా చౌదరి, సినీ నిర్మాతలు అశ్వినీదత్, ఆదిశేషగిరిరావు, దగ్గుబాటి సురేశ్, శ్యాంప్రసాద్ రెడ్డి, సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు, దర్శకుడు బోయపాటి శ్రీను తదితరులు హాజరయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రిలీజ్ కు రెడీ అవుతోన్న గ్యాంగ్ స్టర్ మూవీ టీజర్ లాంఛ్