Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పెద్దనోట్ల రద్దు’తో పేదలపై దాడి: రాహుల్ గాంధీ

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2020 (21:04 IST)
పెద్ద నోట్ల రద్దంటే దేశంలోని పేదలపై దాడి చేయడమని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై మండిపడ్డారు. పేదలతో పాటు అసంఘటిత రంగంపై కూడా దాడికి దిగినట్లేనని ఆయన ఆరోపించారు.

500 రూపాయల నోట్లు, 1,000 నోట్ల రద్దుతో చిరు వ్యాపారులు, రైతులు, అసంఘటిత కార్మికులు ఎలా నష్టపోయారో ట్విట్టర్ వేదికగా వీడియో ద్వారా వివరించారు.
 
ప్రధాని మోదీ ‘నగదు రహిత భారత్’ అని నినాదమిచ్చారని, అది కాస్తా.. ‘‘కార్మిక రహిత, రైతు రహిత, చిన్న వ్యాపార రహిత భారత్’ గా మారిపోయిందని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు తన లక్ష్యాన్ని చేరుకోవడంలో పూర్తిగా విఫలమైందని, నల్లధనాన్ని వెలికితీయడంలో కూడా విఫలమైందని ఆయన మండిపడ్డారు.

ఆ నిర్ణయం దేశంలోని పేదల్లో ఏ రకమైన మార్పూ తీసుకురాలేదని పేర్కొన్నారు.మోదీ ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు కేవలం ధనవంతులకు మాత్రమే ఉపయోగపడిందని, వారి రుణాలు మాఫీ కావడానికి మాత్రమే ఉపయోగపడిందని మండిపడ్డారు.

పేదల జేబులోని డబ్బు, బడా వ్యాపారుల అప్పులు మాఫీ చేయడానికి మాత్రమే ఉపయోగపడిందని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments