Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పెద్దనోట్ల రద్దు’తో పేదలపై దాడి: రాహుల్ గాంధీ

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2020 (21:04 IST)
పెద్ద నోట్ల రద్దంటే దేశంలోని పేదలపై దాడి చేయడమని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై మండిపడ్డారు. పేదలతో పాటు అసంఘటిత రంగంపై కూడా దాడికి దిగినట్లేనని ఆయన ఆరోపించారు.

500 రూపాయల నోట్లు, 1,000 నోట్ల రద్దుతో చిరు వ్యాపారులు, రైతులు, అసంఘటిత కార్మికులు ఎలా నష్టపోయారో ట్విట్టర్ వేదికగా వీడియో ద్వారా వివరించారు.
 
ప్రధాని మోదీ ‘నగదు రహిత భారత్’ అని నినాదమిచ్చారని, అది కాస్తా.. ‘‘కార్మిక రహిత, రైతు రహిత, చిన్న వ్యాపార రహిత భారత్’ గా మారిపోయిందని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు తన లక్ష్యాన్ని చేరుకోవడంలో పూర్తిగా విఫలమైందని, నల్లధనాన్ని వెలికితీయడంలో కూడా విఫలమైందని ఆయన మండిపడ్డారు.

ఆ నిర్ణయం దేశంలోని పేదల్లో ఏ రకమైన మార్పూ తీసుకురాలేదని పేర్కొన్నారు.మోదీ ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు కేవలం ధనవంతులకు మాత్రమే ఉపయోగపడిందని, వారి రుణాలు మాఫీ కావడానికి మాత్రమే ఉపయోగపడిందని మండిపడ్డారు.

పేదల జేబులోని డబ్బు, బడా వ్యాపారుల అప్పులు మాఫీ చేయడానికి మాత్రమే ఉపయోగపడిందని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments