Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలగంగాధర్ తిలక్ ప్రారంభించిన స్కూల్‌లో 138 ఏళ్ల తర్వాత బాలికలకు ఎంట్రీ

స్వాతంత్ర్య సమరయోధుడు బాలగంగాధర్ తిలక్ ప్రారంభించిన పాఠశాలలో 138 యేళ్ళ తర్వాత బాలికలకు ప్రవేశం కల్పించారు. ఈ పాఠశాల మహారాష్ట్రలోని పూణెలోని ఖడ్కీ బజార్‌లో ఉంది. ఈ పాఠశాలను 138 యేళ్ళ క్రితం లోకమాన్య తి

Webdunia
గురువారం, 31 మే 2018 (10:03 IST)
స్వాతంత్ర్య సమరయోధుడు బాలగంగాధర్ తిలక్ ప్రారంభించిన పాఠశాలలో 138 యేళ్ళ తర్వాత బాలికలకు ప్రవేశం కల్పించారు. ఈ పాఠశాల మహారాష్ట్రలోని పూణెలోని ఖడ్కీ బజార్‌లో ఉంది. ఈ పాఠశాలను 138 యేళ్ళ క్రితం లోకమాన్య తిలక్ మరికొంతమంది స్నేహితులు కలిసి ప్రారంభించారు. అప్పటి నుంచి ఎందుకనో ఈ పాఠశాలలో బాలికలు ప్రవేశం కల్పించలేదు. కేవలం బాలురకు మాత్రమే విద్యను చెపుతూ వస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం నుంచి బాలికలకు తొలిసారి అడ్మిషన్లు కల్పించారు. ఇందులోభాగంగా, ఇప్పటివరకు 25 మంది బాలికలు ప్రవేశం కల్పించినట్టు స్కూలు నిర్వాహకులు వెల్లడించారు. దీంతో దశాబ్ధాల పురాతన ఆచారాలకు మంగళం పలికినట్టయింది. 
 
ఈ సందర్భంగా స్కూలు ప్రిన్సిపాల్ మాట్లాడుతూ కొన్నిదశాబ్దాలుగా కొనసాగుతున్న లింగ వివక్షకు ముగింపు పలకాలని పాఠశాల యాజమాన్యం నిర్ణయించింది. ఫలితంగా పాఠశాలలో బాలికల ప్రవేశానికి అనుమతి లభించింది. 1880లో బాలగంగాధర్ తిలక్ ఇతర సంఘసేవకులు గోపాల్ గణేశ్ అగార్కర్, విష్ణుశాస్త్రి చిప్లుంకర్ తదితరులతో కలిసి ఈ పాఠశాలను ప్రారంభించారు. ఈ పాఠశాలను డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ పర్యవేక్షిస్తుందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments