Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐపీఎల్ 2018 : ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన చెన్నై సూపర్ కింగ్స్

ఐపీఎల్ 2018 టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మళ్లీ పుంజుకుంది. గత మ్యాచ్‌లో పంజాబ్‌తో తృటిలో విజయాన్ని చేజార్చుకున్న చెన్నై.. రాజస్థాన్ రాయల్స్‌తో శుక్రవారం మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాణించింద

ఐపీఎల్  2018 : ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన చెన్నై సూపర్ కింగ్స్
, శనివారం, 21 ఏప్రియల్ 2018 (12:24 IST)
ఐపీఎల్ 2018 టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మళ్లీ పుంజుకుంది. గత మ్యాచ్‌లో పంజాబ్‌తో తృటిలో విజయాన్ని చేజార్చుకున్న చెన్నై.. రాజస్థాన్ రాయల్స్‌తో శుక్రవారం మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాణించింది. ఫలితంగా చెన్నై 64 పరుగుల తేడాతో రాజస్థాన్‌పై ఘనవిజయం సాధించింది. 
 
ముఖ్యంగా, సీఎస్కే జట్టు ఓపెనర్ షేన్ వాట్సన్ (57 బంతుల్లో 106, 9ఫోర్లు, 6సిక్స్‌లు) సెంచరీతో చెన్నై 20 ఓవర్లలో 204/5 స్కోరు చేసింది. గోపాల్(3/20) మూడు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత లక్ష్యఛేదనలో రాజస్థాన్ 18.3 ఓవర్లలో 140 స్కోరుకే పరిమితమైంది. బెన్‌స్టోక్స్(45) మినహా ఎవరూ రాణించలేకపోయారు. చాహర్(2/30), శార్దుల్(2/18), బ్రావో(2/16), కర్ణ్‌శర్మ(2/13) రెండేసి వికెట్లతో రాణించారు. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ధనాధన్ ఇన్నింగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సీనియర్ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్(57 బంతుల్లో 106, 9 ఫోర్లు, 6 సిక్స్‌లు) వీరవీహారం చేసిన వేళ చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 204/5 భారీ స్కోరు నమోదుచేసింది. గాయం నుంచి తేరుకుని తిరిగి జట్టులోకి వచ్చిన రైనా(29 బంతుల్లో 49, 9ఫోర్లు)కీలక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. 
 
ఆ తర్వాత లక్ష్యఛేదన రాజస్థాన్‌కు అంతగా కలిసిరాలేదు. చెన్నై బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో చెలరేగడంతో రాజస్థాన్ టపాటపా వికెట్లు చేజార్చుకుంది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న క్లాసెన్(7) పూర్తిగా నిరాశపరిచాడు. అలాగే, శాంసన్(2) నిరాశపరుస్తూ చాహర్ షార్ట్‌పిచ్ బంతికి బలయ్యాడు. 
 
మరోవైపు ఆదిలో బౌండరీలతో ఆకట్టుకున్న కెప్టెన్ రహానే(16) కూడా.. చాహర్ నకుల్ బంతికి వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో రాజస్థాన్ 32 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. ఈ దశలో స్టోక్స్(45), బట్లర్(22) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే బ్రావో వేసిన తొలి బంతికే..బట్లర్ ఔట్ కావడంతో నాలుగో వికెట్‌కు 45 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఇక్కణ్నుంచి రాజస్థాన్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. 63 పరుగుల తేడాతో ఆఖరి ఆరు వికెట్లు కోల్పోయింది. ఫలితంగా రాజస్థాన్ జట్టు 18.3 ఓవర్లలో 140 స్కోరుకే పరిమితమైంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్రిస్ గేల్ అదుర్స్ సెంచరీ.. క్రిసాలినాకు అంకితం.. చిన్న పాపాయికి?