Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒడిశా ఘటన-రెస్క్యూ టీమ్‌లకు ప్రధాని మోదీ అభినందనలు

Webdunia
ఆదివారం, 4 జూన్ 2023 (09:30 IST)
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 280 మందికి పైగా మరణించారు. 800 మందికి పైగా గాయపడగా, పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ఒడిశా రైలు ప్రమాదం కారణంగా ఇప్పటి వరకు 90 రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే యంత్రాంగం తెలియజేసింది. అలాగే, 46 రైళ్లు ప్రత్యామ్నాయ మార్గాల్లో నడుస్తున్నాయి. 11 రైళ్లు పాక్షికంగా రద్దు చేయబడ్డాయి. 
 
ఈ నేపథ్యంలో ఒడిశా రైలు ప్రమాదంలో పోరాడిన రెస్క్యూ టీమ్‌లకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ఈ విషయమై ప్రధాని మోదీ విడుదల చేసిన ట్విట్టర్ సందేశంలో.. కష్టాల్లోనూ ప్రజల ధైర్యం ఉత్సాహాన్ని నింపుతోంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ మన దేశ ప్రజలు చూపిన ధైర్యం, దయ స్ఫూర్తిదాయకం. ప్రమాదం తర్వాత పెద్ద సంఖ్యలో ప్రజలు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. రక్తదానం చేసేందుకు క్యూలో నిలబడ్డారు.
 
రెస్క్యూ ఆపరేషన్‌లను పటిష్టం చేసిన విపత్తు రెస్క్యూ టీమ్, పోలీసులు, వాలంటీర్లందరికీ వందనాలు. ప్రపంచ నాయకుల సంతాపం దుఃఖంలో ఉన్న కుటుంబాలకు బలం చేకూరుస్తుంది. ప్రపంచ దేశాధినేతలు అందిస్తున్న సపోర్ట్‌కి కృతజ్ఞతలు అంటూ పోస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments