Webdunia - Bharat's app for daily news and videos

Install App

మసాజ్‌ సెంటరు పేరుతో వ్యభిచారం.. దంపతుల అరెస్టు

Webdunia
సోమవారం, 1 ఏప్రియల్ 2019 (09:20 IST)
చెన్నైలోని ఓ మసాజ్ సెంటరులో గుట్టుచప్పుడుకాకుండా వ్యభిచార గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఓ ప్రైవేట్ అపార్టుమెంట్‌లో సాగుతూ వచ్చింది. ఈ విషయంపై స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు గుర్తించారు. ఈ వ్యభిచార కేంద్రాన్ని నడుపుతున్న దంపతులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, స్థానిక తేనాంపేట వాసన్‌వీధిలో ఉన్న ఓ ప్రైవేట్ అపార్టుమెంటులో మసాజ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నట్టు స్థానిక పోలీసులకు సమాచారం వచ్చింది. ముఖ్యంగా, రాత్రి సమయంలో అధిక సంఖ్యలో యువకులు వచ్చి వెళుతున్న విషయాన్ని స్థానికులు గుర్తించి తేనాంపేట పోలీసులకు సమాచారం అందించారు. 
 
పోలీసులు సాధారణ దుస్తుల్లో సంబంధిత మసాజ్‌ సెంటర్‌ వద్ద నిఘా వేశారు. అక్కడికి యువకులు వచ్చి వెళుతున్నట్లు తెలిసింది. దీంతో పోలీసులు వెంటనే మసాజ్‌ సెంటర్‌ లోపలికి వెళ్లి తనిఖీ చేశారు. ఆ సమయంలో యువతులతో వ్యభిచారం కార్యకలాపాలు జరిపిస్తున్నట్లు తెలిసింది. మసాజ్‌ సెంటర్‌ యజమాని సెంథిల్‌ (37), అతని భార్య శాంతి (32)ని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఇద్దరు యువతులను విడిపించారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments