Webdunia - Bharat's app for daily news and videos

Install App

సామాజిక న్యాయం కోసమే ఓబీసీ రిజర్వేషన్లు : ప్రధాని నరేంద్ర మోడీ

Webdunia
బుధవారం, 9 జనవరి 2019 (13:44 IST)
సామాజిక న్యాయం కోసంమే అగ్రకులాల్లోని పేదలకు రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. ఓబీసీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ప్రధాని మోడీ సర్కారు లోక్‌సభలో ప్రవేశపెట్టిన విషయం తెల్సిందే. ఈ బిల్లు బుధవారం రాజ్యసభకు వచ్చింది. అయితే, ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని విపక్ష సభ్యులు పట్టుబట్టారు.
 
ఇదిలావుంటే, మహారాష్ట్రలోని సోలాపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని మాట్లాడుతూ, ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాల్లోని పేదలకు సామాజిక న్యాయం దక్కాలన్న ఉద్దేశ్యంతోనే ఈ బిల్లును తీసుకొచ్చినట్టు తెలిపారు.
 
ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలుపగా, రాజ్యసభలోనూ ఆమోదం పొందుతున్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. అన్యాయం జ‌రిగింద‌న్న భావ‌న పోతుంద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తంచేశారు. అంద‌రికీ స‌మాన అవ‌కాశాలు కావాలన్నారు.
 
ఈబీసీ బిల్లు ప్ర‌కారం.. పేద అగ్ర‌కుల‌స్థుల‌కు జ‌న‌ర‌ల్ క్యాట‌గిరీలో 10 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించ‌నున్నారు. రాజ్య‌స‌భ‌ను ఒక రోజు పొడిగించామ‌ని, బ‌హుశా బిల్లును పాస్ చేస్తార‌ని ఆశిస్తున్నాను, ప్ర‌జ‌ల ఆశ‌యాల‌ను గౌర‌విస్తార‌ని భావిస్తున్నాన‌ని, సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని స‌భ్యులు ఈబీసీ బిల్లుకు ఆమోదం తెలుపుతార‌ని ఆశిస్తున్న‌ట్లు ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments