Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీధుల్లో పడ్డ వలస కూలీలకు కావల్సింది అప్పు కాదు, డబ్బు: రాహుల్ గాంధీ

Webdunia
శనివారం, 16 మే 2020 (16:04 IST)
కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా వైరస్ కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ కోసం రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించడాన్ని పునఃపరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ రైతులకు కానీ, వలస కార్మికులకు కానీ తక్షణ ఉపశమనం ఇవ్వదని అభిప్రాయపడ్డారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ సంక్షోభ సమయంలో మన ప్రజలకు డబ్బు కావాలి. ప్యాకేజీలు కాదు. వీధిలో నడుస్తున్న వలస కూలీకి డబ్బు కావాలి, అప్పు కాదు. బాధపడుతున్న రైతుకు డబ్బు కావాలి, అప్పు కాదు. మనం చేయకపోతే ఇది విపత్తుగా పరిణమిస్తుంది. 
లాక్డౌన్ ద్వారా నిరుద్యోగులుగా మిగిలిపోయిన వలసదారుల బ్యాంకు ఖాతాలకు కనీసం 7,500 రూపాయలు నేరుగా బదిలీ చేయాలని పిఎం మోడీకి రాహుల్ గాంధీ అభ్యర్థన చేశారు. కాగా కరోనావైరస్ వ్యాప్తి కారణంగా భారతదేశంలో ఇప్పటివరకు దాదాపు 86,000 కేసులు నమోదవగా 2,700 మందికి పైగా మరణించారు. దేశవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేసిన ఈ కరోనా వైరస్ కారణంగా వలస కార్మికులు, రోజువారీ కూలీలు తీవ్రంగా దెబ్బతిన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments