Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ ప్రధాని వాజ్‌పేయి తృతీయ వర్థంతి : ఘనంగా నివాళులు

Webdunia
సోమవారం, 16 ఆగస్టు 2021 (10:30 IST)
దేశ మాజీ ప్రధానమంత్రి అటల్‌ బిహారి వాజ్‌పేయి మూడో వర్థంతి వేడుకలు ఆగస్టు 16వ తేదీన జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు.
 
ఢిల్లీలోని అటల్‌ సమాధి స్థల్‌లో పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా దేశానికి వాజ్‌పేయి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. హోం మత్రి అమిత్‌ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా మాజీ ప్రధానికి నివాళులు అర్పించారు.
 
ప్రధానిగా పూర్తి పదవీ కాలం పూర్తిచేసిన తొలి కాంగ్రెసేతర నేతగా వాజ్‌పేయి నిలిచారు. 1924, డిసెంబర్‌ 25న మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జన్మించిన వాజ్‌పేయి.. 2018, ఆగస్టు 16న మృతిచెందారు. భారతీయ జనతా పార్టీ తరపున ప్రధాన మంత్రి పదవిని పొందిన తొలి నాయకుడు వాజ్‌పేయి కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments