Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రపతికి కరోనా పరీక్షలు.. అన్ని కార్యక్రమాలు రద్దు

Webdunia
శనివారం, 21 మార్చి 2020 (09:21 IST)
కరోనా వైద్య పరీక్షలు చేయించుకోవాలని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ నిర్ణయించుకున్నారు. దీంతో ఆయన అన్ని రకాల అధికారిక, వ్యక్తిగత పర్యటనలను రద్దు చేసుకున్నారు. 
 
ఇటీవల బాలీవుడ్ సింగ్ కనికా కపూర్ లండన్‌ పర్యటనకు వెళ్లి వచ్చింది. ఆ తర్వాత ఆమె ఎలాంటి వైద్య పరీక్షలు చేయించుకోకుండానే, పార్టీ ఇచ్చింది. ఈ పార్టీకి అనేక మంది సినీ సెలెబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, హితులు, సన్నిహితులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కనికాకు పరీక్షలు చేయగా, ఆమెకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఆమె పార్టీలో పాల్గొన్నవారందరికీ ఈ వైరస్ సోకిందన్న భయం పట్టుకుంది.
 
ఇదిలావుంటే, పార్టీకి బీజేపీ యువ ఎంపీ దుష్యంత్ సింగ్ కూడా హాజరయ్యారు. కనికకు 'కరోనా' ఉందన్న వార్తల నేపథ్యంలో తనకు కూడా ఈ వైరస్ సోకిందన్న అనుమానంతో ఆయన హోం క్యారంటైన్‌కు వెళ్లారు. ఆ తర్వాత ఆయన బీజేపీ ఎంపీల బృందంతో వెళ్లి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. 
 
ఈ నేపథ్యంలో, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రామ్ నాథ్ కోవింద్ వైద్య పరీక్షలు చేయించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలిపాయి. అలాగే అన్ని అధికారిక కార్యక్రమాలను ఆయన రద్దు చేసుకున్నట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments