Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంలో రాష్ట్రపతికి ఆహ్వానం ఎక్కడ: మంత్రి ఉదయనిధి

Webdunia
గురువారం, 21 సెప్టెంబరు 2023 (11:58 IST)
తమిళనాడు మంత్రి, డీఎంకే యువ నేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడైన ఉదయనిధి స్టాలిన్ మరోమారు వార్తలకెక్కారు. కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆహ్వానం దక్కలేదని ఆయన గుర్తు చేశారు. 
 
రాష్ట్రపతి ముర్ము గిరిజన మహిళ కావడం, ఆమె భర్త చనిపోయి విధవంగా ఉండటమే ఇందుకు కారణమని ఆయన అన్నారు. సనాతన ధర్మం అంటే ఇదేనని ప్రశ్నించారు. రూ.800 కోట్ల ఖర్చుతో కట్టిన నూతన పార్లమెంటు ప్రారంభోత్సవానికి తొలి పౌరురాలైన రాష్ట్రపతికి ఆహ్వానం దక్కక పోవడం విచారకరమన్నారు. 
 
మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభళో ప్రవేశపెట్టిన సమయంలో హిందీ నటీమణులనూ ఆహ్వానించారని చెప్పారు. కానీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాత్రం వ్యక్తిగత కారణాల పేరిట దూరంగా ఉండిపోవాల్సి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. సనాతన ధర్మం ప్రభావానికి ఇలాంటి ఘటనలు సూచికలని చెప్పుకొచ్చారు.
 
అంతేకాకుండా సమాజంలోని అంటరానితనం రూపుమాసిపోవాలంటే సనాతన ధర్మాన్ని పూర్తిగా నిర్మూలించాల్సిందేనని ఆయన గుర్తు చేశారు. అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ అంటరానితనం ఉందని ఆయన చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kantara Sequel: కాంతారా చాప్టర్ వన్‌కు కేరళతో వచ్చిన కష్టాలు.. సమస్య పరిష్కరించకపోతే..?

Bellam konda: దెయ్యాలుండే హౌస్ లో కిష్కింధపురి షూటింగ్ చేశాం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Ritika Nayak : సెట్ లో బ్రదర్ సిస్టర్ అని పిలుచుకునే వాళ్లం : రితికా నాయక్

సామాన్యుడి గేమ్ షో గా రానున్న ది లక్ - గెలిచిన వారికి కారు బహుమానం

Samyukta Menon: అందం, ఆరోగ్యం ఒకరిని అనుకరించడం కరెక్ట్ కాదు: సంయుక్త మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

తర్వాతి కథనం
Show comments