Webdunia - Bharat's app for daily news and videos

Install App

తహసీల్దార్‌ గొంతు పట్టుకుని చెంపపై కొట్టిన వైసీపీ నేత

Webdunia
గురువారం, 21 సెప్టెంబరు 2023 (11:51 IST)
ప్రకాశం జిల్లా సంతనూతలపాడు తహసీల్దార్ లక్ష్మీనారాయణరెడ్డిపై వైసీపీ జెడ్పీటీసీ సభ్యురాలు దుంప చెంచిరెడ్డి భర్త దౌర్జన్యానికి పాల్పడ్డాడు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు తహసీల్దార్ లక్ష్మీనారాయణరెడ్డిపై వైసీపీ మండల అధ్యక్షుడు, స్థానిక జెడ్పీటీసీ సభ్యురాలు దుంప చెంచిరెడ్డి మంగళవారం దాడి చేశారు.
 
లక్ష్మీనారాయణరెడ్డి కందుకూరు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేసి తహసీల్దార్‌గా పదోన్నతి పొందారు. విధుల్లో చేరినప్పటి నుంచి కార్యాలయంలో వ్యవహారాలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. నెల రోజుల క్రితం వైసీపీ నేత చెంచిరెడ్డి తనపై దౌర్జన్యం చేయడంతో రెండు వారాల పాటు సెలవుపై వెళ్లారు. 
 
వివిధ పనుల ఒత్తిడి పెరగడంతో తహసీల్దార్ వ్యక్తిగత కారణాలతో ఆగస్టు 18న సెలవుపై వెళ్లారు. సెప్టెంబర్ 11న తిరిగి విధుల్లో చేరారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో చెంచిరెడ్డి మంగళవారం మధ్యాహ్నం రెవెన్యూ కార్యాలయానికి వచ్చి ఎందుకు పని చేయడం లేదని తహసీల్దార్‌తో వాగ్వాదానికి దిగాడు. 
 
నిబంధనలు పాటిస్తున్నామని తహసీల్దార్ చెప్పడంతో చెంచిరెడ్డి మండిపడ్డారు. తహసీల్దార్‌ గొంతు పట్టుకుని చెంపపై కొట్టాడు. దీంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెనాలిలో సమంతకి గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్య సమస్య వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments