Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధికారం వచ్చిన గంటలోనే మద్యపాన నిషేధం ఎత్తివేస్తా.. ప్రశాంత్ కిషోర్

సెల్వి
సోమవారం, 16 సెప్టెంబరు 2024 (13:03 IST)
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అక్టోబర్ 2న తన కొత్త పార్టీ జన్ సూరజ్ పార్టీని ప్రారంభించి అధికారికంగా రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నారు. ఈ మేరకు ఆయన సంచలన ప్రకటన చేశారు.  బీహార్ మద్య నిషేధానికి సంబంధించి వాగ్ధానం చేశారు. 
 
బీహార్‌లో జన్ సూరజ్ ప్రభుత్వం ఏర్పడితే, తాము ఒక గంటలో మద్య నిషేధాన్ని అంతం చేస్తాం  అని కిషోర్ ప్రకటించారు. గత రెండేళ్లుగా తన పార్టీ ఆవిర్భావానికి సిద్ధమవుతున్నానని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనతాదళ్ (యునైటెడ్), ఆర్జేడీని ఓడించడం ఖాయమని పీకే పేర్కొన్నారు.
 
 
 
ఈ సందర్భంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్‌లను కిషోర్ విమర్శిస్తూ, జేడీయూ, ఆర్జేడీ 30 ఏళ్లుగా అధికారాన్ని పంచుకున్నప్పటికీ, బీహార్ అభివృద్ధి చెందలేదు. రెండు పార్టీలు పక్కకు తప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
 
 
 
2016లో విధించినప్పటి నుండి, బీహార్‌లో మద్యపాన నిషేధం అక్రమ మద్యం వినియోగం పెరగడానికి దారితీసింది. ఫలితంగా అనేక మరణాలు సంభవించాయి. నిషేధాన్ని ఎత్తివేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పుకొచ్చారు. అందుకే రాష్ట్రంలో జన్ సూరజ్ ప్రభుత్వం అధికారంలో వస్తే గంటలోనే మద్యపానంపై నిషేధాన్ని ఎత్తివేస్తామని పీకే అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments