Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసత్యాలతో కాలం వెళ్లదీసిన అరవింద్ కేజ్రీవాల్ : బీజేపీ

Webdunia
శనివారం, 25 జనవరి 2020 (13:48 IST)
బీజేపీ దక్షిణాది రాష్ట్రాల కార్యకర్తల సమావేశం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, పార్టీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, పార్టీ జాతీయ సత్య కుమార్ పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు  మాట్లాడుతూ
 బీజేపీలో మాత్రమే ఎవరైనా బూత్ అధ్యక్షుడి నుంచి పార్టీ జాతీయ అధ్యక్షుడు వరకు కావచ్చు. అది మా పార్టీలోనే సాధ్యం అన్నారు.
 
 
ఢిల్లీ ఎన్నికలు మాకు చాలా కీలకమైనవి అని ఢిల్లీలో అభివృద్ధి పనులు బీజేపీ హయాంలోనే జరిగాయి అన్నారు.
 మోడీపై విమర్శలు చేస్తున్న పార్టీలు ప్రజలు తిరస్కరానికి గురవుతున్నాయి అన్నారు. రాహుల్ గాంధీ, మోడీని 5 ఏళ్ళు విమర్శించారు. కానీ ఆ పార్టీ  సీట్లు ఏ మాత్రం పెరగలేదు. రాహుల్ గాంధీని చూసి మోడీతో పోటీ పడ్డారు చంద్రబాబు. చివరకు అధికారం కోల్పోయారు.  కేసీఆర్ కూడా హైదరాబాద్ కొడుక్కి అప్పగించి ఢిల్లీకి వద్దమని ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నం చేశారు. 
 
కానీ లోకసభ ఎన్నికల్లో ఆ పార్టీ కి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా మోడీని విమర్శిస్తూ వున్నారు. అందుకే డిల్లీ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి అత్యంత ప్రాధాన్యంగా భావిస్తున్నాం అని మురళీధర్ రావు చెప్పారు. ఇక కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ ఐదేళ్ళు అబద్ధాలు ప్రచారం చేశారని ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments