Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్‌లో ఉగ్రవాద చర్యలను ఆపాలి- పాక్ వెన్నులో వణుకు పుట్టించాలి

జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాద చర్యలను నిలిపివేసేలా పాకిస్థాన్‌పై సైనిక చర్యలను పెంచాలని.. జమ్మూలో శాంతి నెలకొల్పేందుకు రాజకీయపరమైన కార్యాచరణ అవసరమని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ పేర్కొన్నారు. సైనిక బలగాలు కొత్త

Webdunia
సోమవారం, 15 జనవరి 2018 (17:21 IST)
జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాద చర్యలను నిలిపివేసేలా పాకిస్థాన్‌పై సైనిక చర్యలను పెంచాలని.. జమ్మూలో శాంతి నెలకొల్పేందుకు రాజకీయపరమైన కార్యాచరణ అవసరమని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ పేర్కొన్నారు. సైనిక బలగాలు కొత్త వ్యూహాలను అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన వ్యాఖ్యానించారు.

సరిహద్దులకు అవతలి వైపు ఉగ్రవాద కార్యకలాపాలను నిలిపివేశారని పాకిస్థాన్‌ వెన్నులో దడ పుట్టించాలని.. భారత్ అంటేనే పాక్‌కు వణుకు పుట్టాలని బిపిన్ తెలిపారు. 
 
అది జరగాలంటే... పొలిటికో-మిలిటరీ వైఖరిని అనుసరించాల్సి వుంటుందని తెలిపారు. ఉగ్రవాదుల పనిపట్టడం, తీవ్రవాదుల పట్ల ఆకర్షితులయ్యే వారి సంఖ్య పెరగకుండా చూడటమే తమ పని అంటూ రావత్ వ్యాఖ్యానించారు. రాజకీయ కార్యాచరణకు ఇతర కార్యాచరణలు తోడైతే కశ్మీర్‌లో శాంతి నెలకొంటుందని చెప్పారు. కాశ్మీర్ సమస్య పరిష్కరణలో మిలటరీ ఓ భాగమేనని రావత్ గుర్తు చేశారు. 
 
ఇదిలా ఉంటే.. తమ పాలకులు అనుమతిస్తే భారత్‌పై అణ్వాయుధాలతో దాడి చేయనున్నట్టు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఖ్వాజా ముహమ్మద్‌ ఆసిఫ్‌ సంచలన ప్రకటన చేశారు. భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఇటీవల మాట్లాడుతూ, నిబంధనలకు విరుద్ధంగా పాకిస్థాన్ అణు ఆయుధాలను పెంచుకుంటూ, ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని, ప్రభుత్వం అనుమతిస్తే, తాము పాకిస్థాన్‌పై అణు యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలపై ఖ్వాజా తీవ్ర స్థాయిలో మండిపడుతూ.. ట్వీట్ చేశారు. భారత ఆర్మీ చీఫ్ చాలా బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతూ తమను కవ్విస్తున్నాడని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments