Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్కార్ అవార్డులతో దేశం గర్విస్తుంది : ప్రధాని నరేంద్ర మోడీ

Webdunia
సోమవారం, 13 మార్చి 2023 (12:43 IST)
భారత్‌కు రెండు ఆస్కార్ అవార్డులు రావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. ఈ అవార్డులతో భారత్ ఉప్పొంగుతుందని, గర్విస్తుందని ఆయన పేర్కొన్నారు. నాటు నాటు ప్రజాదారణ విశ్వవ్యాప్తం అయిందని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే, 'ఎలిఫెంట్ విస్పరర్స్‌' చిత్రం ద్వారా ప్రకృతితో కలిసి జీవించాల్సిన ప్రాముఖ్యతను చాటి చెప్పారంటూ విస్పరర్స్ యూనిట్‌కు ప్రశంసించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 
 
"అద్భుతం. నాటు నాటు ప్రజాదారణ విశ్వవ్యాప్తం. ఇది ఎన్నో ఏళ్లు గుర్తిండిపోయే పాట అవుతుంది. ఇంత ప్రతిష్టాత్మక గౌరవం అందుకున్న ఎంఎం కీరవాణి, చంద్రబోస్, మొత్తం చిత్ర బృందానికి నా అభినందనలు. భారతదేశం ఉప్పొంగింది. గర్విస్తుంది అంటూ ట్వీట్ చేశారు. 
 
అలాగే, మరో ట్వీట్‌లో విస్పరర్స్ బృందాన్ని కొనియాడారు. కార్తీకి, గునీత్ మోంగా, ది ఎలిఫెంట్ విస్పరర్స్‌ బృందం మొత్తానికి నా అభినందనలు. ఈ చిత్రంతో సుస్థిరి అభివృద్ధి, ప్రకృతితో సామరస్యంగా జీవించాల్సిన ప్రాముఖ్యతను అద్భుతంగా హైలెట్ చేశారు" అంటూ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments