Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 9 April 2025
webdunia

ప్రభాస్ పాన్-ఇండియన్ సినిమా కోసం ముగ్గురు నిర్మాతలు

Advertiesment
Prabhas
, శనివారం, 11 మార్చి 2023 (18:42 IST)
Prabhas
ఇప్పటివరకు పాన్-ఇండియన్ సినిమాకు ఒకరు, ఇద్దరు నిర్మాతలు ఉండేవారు. బాహుబలి, ఆర్.ఆర్.ఆర్. సినిమాలకు అంతే. కానీ ఇప్పుడు నిర్మాతలు మినిమమ్ ముగ్గురు కావాల్సివస్తుంది. సిండికేటుగా నిర్మాతలు  మారి పెద్ద సినిమాలు తీస్తున్నారు. పాన్-ఇండియన్ యాక్షన్ కోసం ప్రభాస్, సిద్ధార్థ్ ఆనంద్‌తో కలిసి పని చేస్తారు. ఈ సినిమా షూట్ వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రభాస్,  సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్ కోసం  అడ్వాన్స్‌లు చెల్లించింది. సిద్ధార్థ్ చెప్పిన కథకు ప్రభాస్ ఇటీవల అధికారికంగా ఆమోదం తెలిపాడు. 
 
మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి యష్ రాజ్ ఫిల్మ్స్ కూడా ఈ చిత్రాన్ని నిర్మించడానికి లైన్ లో ఉంది. ఈ ప్రాజెక్ట్‌లో ప్రభాస్ హోమ్ బ్యానర్ UV క్రియేషన్స్ మూడవ నిర్మాణ సంస్థ. UV క్రియేషన్స్ ఈ చిత్రంపై పెద్దగా పెట్టుబడి పెట్టలేదు కానీ ప్రాజెక్ట్ తెలుగు థియేట్రికల్ హక్కులను కలిగి ఉన్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రం మల్టీస్టారర్‌గా రూపొందనుందని సమాచారం. సిద్ధార్థ్ ఆనంద్ చివరి చిత్రం పఠాన్ సంచలన విజయం సాధించింది. ప్రస్తుతం హృతిక్ రోషన్  ఫైటర్ షూటింగ్‌లో సిద్ధార్థ్ బిజీగా ఉన్నాడు. ఈ  చిత్రం త్వరలో విడుదల కానుంది. ప్రభాస్ ఆదిపురుష్ షూటింగ్ పూర్తి చేసి ప్రాజెక్ట్ కె, సాలార్, మారుతి సినిమాల తర్వాత సిద్ధార్థ్ సినిమా ఉండనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దసరా పై కూడా కన్నడ లోచాలా క్రేజ్ వుంది : దీక్షిత్ శెట్టి