Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశీ విశ్వనాథుడి సేవలో ప్రధాని నరేంద్ర మోడీ

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (16:14 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన కాశీ విశ్వనాథుడి సేవలో నిమగ్నమయ్యారు. ఇందుకోసం ఆయన ముందుగా గంగానదిలో లలితా ఘాట్ వద్ద పుణ్యస్నానం ఆచరించారు. ఆ తర్వాత ఆ నదీజలంతో విశ్వనాథుడి వద్దకు వెళ్లి అభిషేకం చేశారు. 
 
ఈ సందర్భంగా ఆలయ పూజారులు శాస్త్రోక్తంగా రుద్రాభిషేకం నిర్వహించారు. గంగానది నీటిలో ఆలయానికి వెళుతున్న సమయంలో ప్రధాని మోడీకి ఆలయ పూజారులు స్వాగతం పలికారు. 
 
నది నుంచి కొంతదూరం వరకు కారులో వెళ్లి ఆ తర్వాత ఆయన నడుచుకుంటూ స్వామి వారి సన్నిధికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. గర్భగుడిలో మోడీతో వేద పండితులు అభిషేకం చేయించారు. తొలుత వారు సంకల్పం చదివారు. 
 
విఘ్నేశ్వర పూజ, బిల్వపత్రం సమర్పణ, పంచామృత పూజ, వస్త్రం, యజ్ఞోపవీతం సమర్పణ, నమక చమకాలతో విశ్వనాథుడి ఆలయం మంత్రోచ్ఛరణతో ప్రజ్వరిల్లింది. కాశీ విశ్వనాథుడికి అభిషేకం చేసిన మోడీ నైవేద్యం సమర్పించారు. 
 
కర్పూరహారం, కరుణావతారం అంటూ గర్భగుడిలో విశ్వనాథుడిని కీర్తించారు. ఆలయ పూజాలులు ప్రధాని మోడీకి ఆశీర్వాదాలు అందించారు. ఆ తర్వాత కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments