Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెయిల్ రద్దు చేయాలంటూ 'ఆర్ఆర్ఆర్' పిటిషన్ - సీఎం జగన్‌కు కోర్టు నోటీసు

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (16:02 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోమారు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. జగన్‌పై 11 చార్జిషీటులు ఉన్నాయని, ఆయన బయట వుంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని అందువల్ల తక్షణ బెయిల్‌ను రద్దు చేయాలని కోరారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు ఏపీ సీఎం జగన్‌కు నోటీసు జారీ చేస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదావేసింది. 
 
నిజానికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులపై ఉన్న అన్ని రకాల కేసులను త్వరితగతిన విచారించి ముగించాల్సివుంది. అందువల్ల జగన్ బెయిల్ రద్దు చేసి అన్ని చార్జిషీట్లపై విచారణ జరిపించాలని రఘురామకృష్ణంరాజు కోరారు. ఈ నేపథ్యంలో జగన్‌కు హైకోర్టు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను రెండు వారాల పాటు వాయిదావేసింది. ఈ నోటీసులకు జగన్ ఇచ్చే సమాధానాన్ని బట్టి హైకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా, జగన్ రద్దు చేయాలని కోరుతూ గతంలో రఘురామ సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments