బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌కు ప్రధాని మోడీ ఫోన్ - స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందంపై..

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2022 (08:34 IST)
బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా భారత సంతతికి చెందిన పౌరుడు రిషి సునక్ బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఆయనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేసి అభినందించారు. ఈ సందర్భంగా వారిద్దరూ ఇరు దేశాల స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందంపై కొద్దిసేపు చర్చ జరిగినట్టు సమాచారం. అలాగే, ప్రధాని మోడీకి రిషి సునక్ ధన్యవాదాలు తెలిపారు. 
 
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం విషయంలో ఇరు దేశాల మధ్య నిలిచిన చర్చలను వీలైనంత త్వరగా ముగించాలని వారిద్దరూ ఈ సందర్భంగా ఓ అంగీకారానికి వచ్చినట్టు ప్రధాని మోడీ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 
 
భద్రత, రక్షణ, ఆర్థిక రంగాల్లో కలిసి పని చేయడం ద్వారా ఇరు దేశాలు ఎంతో సాధించవచ్చన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడాలని ఆకాంక్షించారు. రిషి సునక్ బ్రిటన్ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సానుకూలంగా స్పందించారు. 
 
ఈ ఒప్పందంపై గత జనవరిలో ప్రారంభమైన చర్చలు బ్రిటన్‌లో నెలకొన్న రాజకీయ అస్థిరత కారణంగా అర్థాంతరంగా ఆగిపోయాయి. నాడు ఆర్థిక మంత్రిగా ఉన్న రిషి సునక్ ఇపుడు బ్రిటన్ ప్రధాని కావడంతో తిరిగి ఈ ఒప్పందంపై చర్చలు సానుకూలంగా ముగిసే అవకాశం ఉందని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments