Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రకాశ్ సింగ్ బాదల్ ప్రధాని మోడీ ఘన నివాళి

Webdunia
బుధవారం, 26 ఏప్రియల్ 2023 (14:29 IST)
శిరోమణి అకాలీదళ్ పార్టీ అగ్రనేత, పంజాబ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్‌కు ప్రధాని నరేంద్ర మోడీ ఘన నివాళులు అర్పించారు. ఇందుకోసం ప్రధాని బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి చంఢీఘర్‌కు ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. ఎయిర్ పోర్టు నుంచి నేరుకాగ శిరోమణి అకాలీదళ్ పార్టీ కార్యాలయానికి చేరుకున్న ఆయన.. ప్రకాశ్ సింగ్ బాదల్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.
 
బాదల్ మృతిపై ప్రధాని మోడీ ట్వీట్ చేస్తూ, ప్రకాశ్ సింగ్ మృతి తనకు వ్యక్తిగతంగా నష్టం. ఎన్నో దశాబ్దాలుగా ఆయనతో నాకు సన్నిహిత సంబంధం ఉంది. ఆయన నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను" అంటూ ట్వీట్ చేశారు. దేశానికి బాదల్ ఎన్నో సేవలు అందించారనీ, పంజాబ్ అభివృద్ధి కోసం ఎంతో కష్టపడి పని చేశారంటూ ప్రధాని కీర్తించారు. బాదల్‌ను గతంలో కలుసుకున్న ఫోటోను సైతం ఈయన ఈ సందర్భంగా పోస్ట్ చేశారు. 
 
మరోవైపు, బాదల్ మృతిపై కేంద్ర సర్కారు రెండు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించింది. 1957లో సర్పంచ్‌గా ఎన్నికై బాదల్ ఆ తర్వాత పంజాబ్ రాష్ట్రానికి ఐదు పర్యాయాలపాటు ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. ఎన్డీయే భాగస్వామిగాను ఎస్.ఏ.పీ సుధీర్ఘకాలంగా ఉంది. నూతన రైతు చట్టాలకు నిరసనగా రైతుల ఆందోళన నేపథ్యంలో ఎన్డీయే కూటమి నుంచి ఎస్.ఏ.పీ 2020లో బీజేపీతో సంబంధాలను తెంచుకుంది. 

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments