Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజీవ్ గాంధీ తరహాలోనే ప్రధానిపై దాడి చేస్తాం.. కేరళలో హెచ్చరిక

Advertiesment
Modi
, శనివారం, 22 ఏప్రియల్ 2023 (21:55 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కేరళలో దాడి హెచ్చరికలు ఎదురయ్యాయి. సోమవారం కేరళలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. కేరళ తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని జెండా ఊపి, కొచ్చి వాటర్ మెట్రోను ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో మోదీపై దాడి జరుగుతుందని హెచ్చరిస్తూ కేరళ బీజేపీ చీఫ్ కే సురేంద్రన్‌కు బెదిరింపు లేఖ వచ్చింది. 
 
ఈ లేఖ‌లో గ‌తంలో మాజీ ప్ర‌ధాని, దివంగ‌త నేత రాజీవ్ గాంధీ మీద జ‌రిగిన త‌ర‌హాలోనే మోదీపై దాడి చేస్తామ‌ని హెచ్చ‌రించారు. దీంతో బీజేపీ వర్గాల్లో కలకలం మొదలైంది. వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. లేఖలో ఉన్న చిరునామా ఆధారంగా లేటర్ రాసిన వ్యక్తి కొచ్చికి చెందిన ఎన్‌కె జానీగా గుర్తించారు.
 
కొచ్చికి చెందిన జానీ, లేఖ రచయిత అని కొట్టిపారేశాడు. అయితే తన పట్ల పగతో ఉన్న ఎవరైనా హత్య బెదిరింపుకు కారణమై ఉండవచ్చని చెప్పుకొచ్చాడు. ఆ లేఖ తాను రాయలేదని జానీ తెలిపాడు. పోలీసులు తన చేతివ్రాతను లేఖతో పోల్చారని, అది రాసింది తాను కాదని నిర్ధారించారని జానీ పేర్కొన్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సింగపూర్‌ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించిన భారత్