Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సింగపూర్‌ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించిన భారత్

ISRO
, శనివారం, 22 ఏప్రియల్ 2023 (20:22 IST)
సింగపూర్‌కు చెందిన TeLEOS-2, Lumilite-4 ఉపగ్రహాలను భారత్ శనివారం విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ తాజా రాకెట్ విజయంతో, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 1999 నుండి 36 దేశాలకు చెందిన 424 విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
 
మిషన్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఛైర్మన్ S. సోమనాథ్ మాట్లాడుతూ.. "PSLV రాకెట్ ఉపగ్రహాలను ఉద్దేశించిన కక్ష్యలో ఉంచింది. పరిశ్రమ తయారీకి సిద్ధమవుతున్నందున రాకెట్ ధరను తగ్గించడానికి ఇస్రో బృందం అనేక కొత్త పనులను చేసిందని సోమనాథ్ తెలిపారు.
 
వేరు చేయలేని ఏడు పేలోడ్‌లను అమర్చిన రాకెట్‌లోని పై దశ ఒక నెలపాటు కక్ష్యలో తిరుగుతూ ప్రయోగాలు చేస్తుందని సోమనాథ్ చెప్పారు. PSLV కోర్ అలోన్ వేరియంట్ రాకెట్ 741 కిలోల సింథటిక్ ఎపర్చరు రాడార్ ఉపగ్రహం TeLEOS-2ను ప్రాథమిక ప్రయాణీకుడిగా.. 16 కిలోల బరువున్న లుమిలైట్-4, సాంకేతిక ప్రదర్శన నానో ఉపగ్రహాన్ని సహ-ప్రయాణికుడుగా సతీష్ ధావన్ స్పేస్‌లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుండి పేల్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉంది: రఘురామకృష్ణంరాజు