Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉంది: రఘురామకృష్ణంరాజు

chandrababu
, శనివారం, 22 ఏప్రియల్ 2023 (20:01 IST)
ఏపీ ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రాణాలకు ముప్పు వుందని ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రఘురామ లేఖ రాశారు. ఏపీలో రాజకీయం హద్దులు దాటుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులను, కార్యకర్తలను దుర్మార్గంగా వేధిస్తున్నారంటూ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని ప్రధాని దృష్టికి ఎంపీ తీసుకెళ్లారు. 
 
ప్రకాశం జిల్లా యర్రగొండ పాలెంలో చంద్రబాబు నాయుడు ర్యాలీ సందర్భంగా ఆయన వాహనంపై రాళ్లతో దాడి చేశారని లేఖలో తెలిపారు. జెడ్ ప్లస్ కేటగిరీ సిబ్బంది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను అడ్డుగా ఉంచి చంద్రబాబుకు రక్షణ కల్పించారన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు భారీ కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు పోలీసులు ఎందుకు కలిపించలేదని రఘురామ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బంగ్లాను ఖాళీ చేసిన రాహుల్ గాంధీ