Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వచ్చే నెలలో భాగ్యనగరికి వస్తున్న ప్రధాని.. ఎందుకో తెలుసా?

narendramodi
, సోమవారం, 27 మార్చి 2023 (13:36 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చే నెలలో హైదరాబాద్ నగరానికి వస్తున్నారు. ఏప్రిల్ 8వ తేదీన భాగ్యనగరికి వచ్చే ఆయన... సికింద్రాబాద్ - తిరుపతి ప్రాంతాల మధ్య వందే భారత్ రైలు సేవలను జెండా ఊపి ప్రారంభిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే సికింద్రాబాద్ - విశాఖపట్టణం ప్రాంతాల మధ్య ఈ వందే భారత్ రైలు నడుస్తున్న విషయం తెల్సిందే. ఇపుడు కొత్తగా మరో రైలును తెలుగు రాష్ట్రాల్లో నడుపనున్నారు. అయితే, సికింద్రాబాద్ - తిరుపతి ప్రాంతాల మధ్య నడిపే వందే భారత్ రైలు ప్రయాణ సమయం, చార్జీలను దక్షిణ మధ్య రైల్వే బహిర్గతం చేయాల్సివుంది.
 
ఇదిలావుంటే, తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావుకు, ప్రధాని మోడీకి ఏమాత్రం పొసగడం లేదు. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. అలాగే, ఈ రెండు పార్టీల నేతల మధ్య కూడా మాటల యుద్ధం సాగుతోంది. గతంలో ప్రధాని హైదరాబాద్ నగరానికి వచ్చినపుడు కూడా ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్ ఎయిర్‌పోర్టుకు కూడా వెళ్లని విషయం తెల్సిందే. మరి ఈ దఫా ఎలా చేస్తారో వేచి చూడాల్సివుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నరబలి పేరుతో పదేళ్ల బాలుడిని గొంతుకోసి చంపేసిన బంధువు.. ఎక్కడ?