Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆస్కార్ అవార్డులతో దేశం గర్విస్తుంది : ప్రధాని నరేంద్ర మోడీ

Modi
, సోమవారం, 13 మార్చి 2023 (12:43 IST)
భారత్‌కు రెండు ఆస్కార్ అవార్డులు రావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. ఈ అవార్డులతో భారత్ ఉప్పొంగుతుందని, గర్విస్తుందని ఆయన పేర్కొన్నారు. నాటు నాటు ప్రజాదారణ విశ్వవ్యాప్తం అయిందని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే, 'ఎలిఫెంట్ విస్పరర్స్‌' చిత్రం ద్వారా ప్రకృతితో కలిసి జీవించాల్సిన ప్రాముఖ్యతను చాటి చెప్పారంటూ విస్పరర్స్ యూనిట్‌కు ప్రశంసించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 
 
"అద్భుతం. నాటు నాటు ప్రజాదారణ విశ్వవ్యాప్తం. ఇది ఎన్నో ఏళ్లు గుర్తిండిపోయే పాట అవుతుంది. ఇంత ప్రతిష్టాత్మక గౌరవం అందుకున్న ఎంఎం కీరవాణి, చంద్రబోస్, మొత్తం చిత్ర బృందానికి నా అభినందనలు. భారతదేశం ఉప్పొంగింది. గర్విస్తుంది అంటూ ట్వీట్ చేశారు. 
 
అలాగే, మరో ట్వీట్‌లో విస్పరర్స్ బృందాన్ని కొనియాడారు. కార్తీకి, గునీత్ మోంగా, ది ఎలిఫెంట్ విస్పరర్స్‌ బృందం మొత్తానికి నా అభినందనలు. ఈ చిత్రంతో సుస్థిరి అభివృద్ధి, ప్రకృతితో సామరస్యంగా జీవించాల్సిన ప్రాముఖ్యతను అద్భుతంగా హైలెట్ చేశారు" అంటూ ట్వీట్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

H3N2 వైరస్.. ఇద్దరు మృతి.. H3N2 వైరస్ అంటే ఏమిటి? లక్షణాలు ఏంటి?