Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ యవనికపై భారత్ ప్రత్యేక ముద్ర : ప్రధాని మోడీ

Webdunia
సోమవారం, 15 ఆగస్టు 2022 (09:53 IST)
ప్రపంచ యవనికపై భారత్ ప్రత్యేక ముద్ర వేసిందని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకుని ఎర్రకోటపై నుంచి ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. ఆ తర్వాత ఆయన ప్రసంగించారు. 
 
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత స్వాతంత్ర్యం వచ్చినప్పుడు భారత్‌ నిలబడలేదని, ముక్కలు చెక్కలవుతుందని చాలామంది అన్నారని, కానీ వారి అనుమానాలను పటాపంచలు చేస్తూ భారత్‌ నిలిచి గెలిచిందన్నారు. ఆకలికేకల భారతావని నేడు ఆహార ధాన్యాల ఎగుమతి స్థాయికి చేరుకుందని గుర్తు చేశారు. వైజ్ఞానిక రంగంలో ఇండియా తన ముద్ర వేస్తున్నదని చెప్పారు. 
 
భారత ప్రజాస్వామ్యం ప్రపంచానికి ఆదర్శంగా నిలబడిందని చెప్పిన ఆయన ప్రజాస్వామ్య దేశాలకు భారత్‌ మార్గదర్శిగా నిలిచిందని స్పష్టం చేశారు. మహాత్మునికి ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతుందన్నారు. దేశప్రగతిని పరుగులు పెట్టించేందుకు ప్రతి పౌరుడు సిద్ధంగా ఉన్నాడని గుర్తుచేశారు. 
 
భారత ప్రజానీకం నవచేతనతో మందడుగు వేస్తున్నది. వచ్చే 25 ఏండ్లు పంచ ప్రాణాలుగా భావించి అభివృద్ధి కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. స్వతంత్ర సమరయోధుల ఆకాంక్షలను సాకారం చేయాలన్నారు. సంపూర్ణ అభివృద్ధి మనముందున్న అతిపెద్ద సవాలని చెప్పారు. మనలో ఏ మూలన దాగివున్న బానిస మనస్తత్వాన్ని వదిలేయాని సూచించారు. సర్వ స్వతంత్ర ప్రజాస్వామ్యంగా మనం నిలబడాలని ఆయన కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments