Webdunia - Bharat's app for daily news and videos

Install App

బానిస సంకెళ్ళ ఛేదనలో వారి పోరాటం అనుపమానం : ప్రధాని

Webdunia
సోమవారం, 15 ఆగస్టు 2022 (09:29 IST)
దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించడానికి ఏకైక కారణం త్యాగధనుల పోరాటాల ఫలితమేనని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మహనీయులు మనకు స్వాతంత్ర్యం అందించారని, బానిస సంకెళ్ల ఛేదనలో వారి పోరాటం అనుపమానమన్నారు. 
 
దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని సోమవారం ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ఎర్రకోటపై నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి సుధీర్ఘ ప్రసంగం చేశారు.
 
గాంధీజీ, చంద్రబోస్‌, అంబేద్కర్‌ వంటివారు మార్గదర్శకులని వెల్లడించారు. మంగళ్‌పాండేతో ప్రారంభమైన సమరంలో ఎందరో సమిధలయ్యారని, సమరయోధులు తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేశారని తెలిపారు.
 
76వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం దేశప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య వజ్రోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 
 
ప్రపంచవ్యాప్తంగా భారత స్వాతంత్య్ర దినోత్సవం జరుగుతున్నదని చెప్పారు. అమృత మహోత్సవాల వేళ భారతీయులందరికీ శుభాకాంక్షలు. అమృత మహోత్సవాల వేళ కొత్త దశ, దిశ ఏర్పాటు చేసుకోవాలన్నారు.
 
‘మహనీయుల తీరుగుబాట్లు మనకు స్ఫూర్తి. అల్లూరి, గురు గోవింద్‌ వంటివారి తిరుగుబాట్లు మనకు ఆదర్శం. త్యాగధనుల బలిదానాలను స్మరించుకునే అదృష్టం కలిగింది. ఇది దేశ నలుమూలలా ఎందరో వీరులను స్మరించుకునే రోజు. జీవితాలనే త్యాగం చేసినవారి ప్రేరణతో నవ్వదిశలో పయనించాలన్నారు. 
 
మన ముందున్న మార్గం కఠినమైనది. ప్రతి లక్ష్యాన్ని సకాలంలో సాధించాల్సిన బాధ్యత మనపై ఉంది. 75 ఏండ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాం. వందల ఏండ్ల బానిసత్వంలో భారతీయతకు భంగం కలిగింది. బానిసత్వంలో భారతీయత భావన గాయపడింది’ అని ప్రధాని మోడీ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేసిన రానా నాయుడు 2 వచ్చేస్తుంది

ANR: మళ్ళీ తెరమీద 68 సంవత్సరాల మాయాబజార్ రీరిలీజ్

ఆకట్టుకుంటోన్న విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం లాయర్ టైటిల్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments