Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహారాష్ట్ర బీడ్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

road accident
, ఆదివారం, 14 ఆగస్టు 2022 (13:38 IST)
మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఉదయం 5.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. 
 
మంజార్ సంబా - పటోడా జాతీయ రహదారిపై కారు, డీసీఎం వ్యాను ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో కారు డీసీఎం వ్యాను కింది భాగానికి దూసుకొని వెళ్ళడంతో కారు నుజ్జునుజ్జు అయింది. 
 
ఈ ప్రమాద వార్త తెలుసుకున్న వెంటనే పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక  చర్యలు చేపట్టారు. ఈ మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశాఖపట్టణంలో అగ్నివీర్ రిక్రూట్మెంట్స్ ప్రారంభం