Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటకలో ప్రధాని ఎన్నికల ప్రచారం- 26 కిలోమీటర్ల భారీ రోడ్‌ షో (video)

Webdunia
శనివారం, 6 మే 2023 (21:32 IST)
Modi
కర్ణాటకలో బీజేపీ జెండా ఎగురవేసేందుకు ఆ పార్టీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ నేతలు కర్ణాటకలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం బెంగళూరులో దాదాపు మూడున్నర గంటలపాటు సాగిన 26 కిలోమీటర్ల భారీ రోడ్‌షోకి నాయకత్వం వహించారు.
 
ఈ కార్యక్రమం శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1:30 గంటలకు ముగిసింది. మొదట్లో మే 7న షెడ్యూల్ చేయబడింది. 
 
కానీ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) పరీక్ష కారణంగా ముందుగానే నిర్వహించడం జరిగింది. దాదాపు డజను అసెంబ్లీ సెగ్మెంట్‌లను కవర్ చేస్తూ దక్షిణ-మధ్య బెంగళూరు గుండా వెళ్లేందుకు వ్యూహాత్మకంగా రోడ్‌షో నిర్వహించింది.
 
రోడ్‌షో కోసం బీజేపీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇందులో రోడ్ల పక్కన బారికేడ్‌లు ఏర్పాటు చేయడం, 26 కిలోమీటర్ల మార్గంలో పుష్ప వర్షం, బీజేపీ జెండాలు, అలంకరణలు అదరగొట్టాయి. ఈ రోడ్ షో భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments